

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై కొత్త ప్రచారం మొదలైంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు నిజమైతే ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేయనుంది. గతంలో ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!