

తమిళ స్టార్ హీరో సూర్యకు 2026 సంవత్సరం ప్రత్యేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే ఏడాదిలో ఆయన నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కరుప్పు సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న సూర్య, మరో రెండు చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కరుప్పు విజయంతో మంచి కంబ్యాక్ ఇచ్చిన సూర్య, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సూర్య 47వ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విడుదలైతే అభిమానులకు ఇది ప్రత్యేక కానుకగా మారనుంది. అయితే విడుదల తేదీలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!