
సినిమాలు

ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 55వ చిత్రం “D55”కు సంబంధించిన “ఫస్ట్ స్ట్రైక్” గ్లింప్స్ను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో ఇప్పటికే కౌంట్డౌన్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాజ్కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వండర్బార్ ఫిలిమ్స్, ఆర్టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో ధనుష్తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ స్ట్రైక్ ద్వారా సినిమా కథా నేపథ్యం, విజువల్ స్కేల్, పాత్రల తీరు గురించి తొలి సంకేతాలు లభించే అవకాశం ఉండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!