
జనరల్

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’పై ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీని ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 5 విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!