

తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడగా, ఇప్పుడు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పూజా హెగ్డే జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారని, నిడివి కారణంగా కొన్ని సీన్లు తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు చెప్పారు.
మమితా బైజు గురించి మాట్లాడుతూ, ‘ప్రేమలు’ సినిమా చూసిన తర్వాత ఆమె నటన తనకు బాగా నచ్చిందని తెలిపారు. విజయ్ కూతురు పాత్ర కోసం శ్రీలీలతో పాటు మమిత పేరును పరిశీలించగా, చివరకు మమితను ఎంపిక చేశామని చెప్పారు. ఆమె ఎనర్జీ, ప్రవర్తన చూసి లేడీ విజయ్లా అనిపిస్తుందని ప్రశంసించారు. ‘డ్యూడ్’లో ఆమె పాత్ర స్వభావం వేరే హీరోయిన్ అయితే తిరస్కరించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. మమిత నటన నచ్చి, ఈ సినిమాలో ఆమెకు మరిన్ని యాక్షన్ సీన్లు ఇవ్వాలని విజయ్ స్వయంగా సూచించారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, వరుస ఫ్లాపులతో ఉన్న పూజా హెగ్డేకు ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో అనే చర్చ జరుగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!