
క్రీడలు

ఒకరు తన స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే, మరొకరు సహజమైన నటనతో మనసుల్లో నిలిచిపోతారు. ఇలాంటి ఇద్దరు తారలు సాయిపల్లవి, శ్రీలీల ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఈ ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది.
ఈ చిత్ర టైటిల్ను ఈ నెల 18న అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సాయిపల్లవి పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. వుండర్బార్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!