

నందమూరి తారక రామారావు జూనియర్ ప్రధాన పాత్రలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ‘కార్తికేయ’ చిత్రం అధికారికంగా ప్రకటించారు. యుద్ధ దేవుడిగా ప్రసిద్ధి చెందిన కార్తికేయుడి పురాణ గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ‘ఒక ఈటె, ఒక లక్ష్యం, ఒక దైవిక తీర్పు’ అనే ట్యాగ్లైన్తో విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. భావోద్వేగాలు, భారీ యుద్ధ సన్నివేశాలు, దైవిక అంశాలతో సినిమా రూపొందుతుందని, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నారని చిత్రబృందం తెలిపింది.
మరోవైపు, ‘జై భీమ్’ కలయిక మళ్లీ తెరపైకి వస్తోంది. సూర్య మరియు దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కలిసి చేస్తున్న కొత్త చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే కథతో సినిమా రూపొందుతుందని తెలిపారు. నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ ప్రాజెక్ట్పై ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!