

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన కాజల్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఆమె తెలిపింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు తీసుకునే ఆహారం, వారి ఆరోగ్యం విషయంలో మరింత బాధ్యత పెరిగిందని పేర్కొంది. మన రోజువారీ జీవితానికి సంబంధించిన కీలక అంశాలను స్పృశించే కథ కావడంతో ఈ చిత్రానికి వెంటనే అంగీకరించినట్లు వెల్లడించింది.
ఇకపై ఎక్కువ సినిమాలు చేయడం కంటే మంచి కథలను ఎంపిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తానని కాజల్ స్పష్టం చేసింది. ఏడాదికి 8 లేదా 9 సినిమాలు చేయాలనే ఆలోచన ఇప్పుడు లేదని, కేవలం 3 లేదా 4 నాణ్యమైన చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. కమర్షియల్ పాత్రల కంటే కథలో బలమైన ప్రాధాన్యం ఉన్న పాత్రలపైనే తన దృష్టి ఉంటుందని వెల్లడించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రలోనే కనిపించనున్నట్లు కాజల్ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!