
గాసిప్స్

ఇటీవల దేవుడి నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ‘ఇరుముడి’లో కథతో పాటు అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు, సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నేపథ్యంలో.. ఇప్పుడు మరో భక్తి కథతో ‘మహేంద్రగిరి వారాహి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబరు 11న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వారాహి అమ్మవారి కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఐశ్వర్య రాజేశ్ వారాహి అమ్మవారి పాత్రలో కనిపించనుండగా, సిద్ధు జొన్నలగడ్డ అతిథి పాత్రలో మెరవనున్నారు. ట్రైలర్లోని విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆసక్తికరమైన అంశాలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!