

సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు మంచి స్పందన రావడంతో చిత్రబృందం చెన్నైలో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి మమితా బైజు సినిమా విజయంపై భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఇంకా చూడని వారు తప్పక థియేటర్లకు వెళ్లి చూడాలని, సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి అనుభూతితో, నిండిన మనసుతో తిరిగి వస్తారని ఆమె అన్నారు.
ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాలను అందించిందని మమితా బైజు తెలిపారు. ముఖ్యంగా థియేటర్లలో ‘పట్టాంబూచి’ పాట సమయంలో, అలాగే తన కామెడీ సన్నివేశాలకు చిన్నారులు సీట్లలో నుంచి లేచి కేరింతలు కొడుతున్న వీడియోలు చూసి ఎంతో సంతోషించానని చెప్పారు. చిన్నతనంలో తాను కూడా అభిమాన నటులను థియేటర్లలో చూసి ఇలాగే సంబరపడేదాన్నని, ఇప్పుడు పిల్లలు తన నటనను చూసి అదే విధంగా ఆనందించడం మాటల్లో చెప్పలేని అనుభూతి అని మమితా పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!