

ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఆరుగురు పతివ్రతలు చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. బుల్లితెరపై ఎన్నోసార్లు ప్రసారమై మంచి ఆదరణ పొందిన ఈ సినిమా సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ తరచూ ట్రెండింగ్లో కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం రీ రిలీజ్ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా కొత్త డిజిటల్ ప్రింట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అప్పటి ప్రేక్షకులతో పాటు కొత్త తరం కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతోంది.
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల సమయంలోనే విభిన్న కథాంశంతో పెద్ద చర్చకు దారితీసింది. మహిళల జీవితాల్లోని భావోద్వేగాలను, వైవాహిక సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలను బోల్డ్ టచ్తో పాటు వినోదాత్మకంగా చూపించిన తీరు అప్పట్లో విశేష స్పందన అందుకుంది. విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ప్రింట్తో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మరోసారి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!