

అక్కినేని నాగచైతన్యతో వివాహం అనంతరం సినిమాలకు కొంత విరామం ఇచ్చిన నటి శోభిత ధూళిపాళ ఇటీవల ‘చీకటిలో’ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘వెట్టువం’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న ఆమె, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో పూర్తిగా మర్చిపోవాలనుకునే విషయం ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు శోభిత ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
“నిన్నటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను, ప్రతి జ్ఞాపకాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటాను” అని శోభిత తెలిపారు. కొన్నిసార్లు మతిమరుపు కూడా మనిషికి ఒక గొప్ప వరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతరులు కలిగించిన బాధలు, చేదు అనుభవాలు, మనసును గాయపరిచిన జ్ఞాపకాలను వదిలిపెట్టినప్పుడే జీవితంలో స్వేచ్ఛగా ముందుకు సాగగలమని పేర్కొన్నారు. గతంలోనే చిక్కుకుపోకుండా భవిష్యత్తుపై సానుకూల దృష్టితో ముందుకు సాగడం అవసరమని ఆమె చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!