

బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఈథ’ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఛావా’ ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తున్న ఈ సినిమా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఆగస్టు 28న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను తాజాగా విడుదల చేయగా, భావోద్వేగభరితమైన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
లాంతర్ల వెలుగులో శ్రద్ధా కపూర్ ప్రదర్శించిన నృత్య సన్నివేశాలు టీజర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘‘మంచం మీద చనిపోతే నిస్సహాయురాలిగా గుర్తుంచుకుంటారు.. నాట్యం చేస్తూ చనిపోతే దిగ్గజంగా గుర్తుంటాను’’ అనే డైలాగ్ కళ పట్ల పాత్రకు ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తోంది. విఠాబాయి జీవితం స్ఫూర్తిగా రూపొందిన ఈ చిత్రం కళాకారిణి పోరాటం, పట్టుదల, కళపై ప్రేమను హృద్యంగా ఆవిష్కరించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!