

రాకింగ్ స్టార్ యష్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 1950 నుంచి 1970 మధ్య గోవా డ్రగ్స్ కార్టెల్ మాఫియా నేపథ్యంలో రూపొందుతోంది. నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన నట జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన సన్నివేశాల్లో ఒకటి ఈ సినిమాలో ఉందని తెలిపారు. షూటింగ్ రోజున దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రెండు నుంచి మూడు పేజీల కన్నడ డైలాగ్స్ ఉన్న స్క్రిప్ట్ ఇచ్చారని, కన్నడ భాషపై పూర్తి పట్టు లేకపోయినా సవాల్గా స్వీకరించి సెట్లోనే అన్ని డైలాగ్స్ నేర్చుకుని ఒకే టేక్లో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని చెప్పారు. రెండు రోజుల పాటు చిత్రీకరించాలని భావించిన ఆ సన్నివేశాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేయడం ఆనందంగా అనిపించిందని, ప్రేక్షకుల స్పందన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కియారా పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!