
రాజకీయాలు

టాలీవుడ్లో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో రవితేజ, శ్రీవిష్ణు కలిసి ఒక భారీ సినిమాలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. మాస్ ఎనర్జీతో రవితేజ, డిఫరెంట్ స్టైల్తో శ్రీవిష్ణు కలయిక ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్ను ‘రాజ రాజ చోర’, ‘శ్వాగ్’ సినిమాల దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్నట్లు సమాచారం.
ఈ భారీ మల్టీస్టారర్ను దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి 2027 రిలీజ్ టార్గెట్గా మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇద్దరు ఎనర్జిటిక్ హీరోల కలయికతో ఈ ప్రాజెక్ట్పై టాలీవుడ్లో ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!