

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత బ్యానర్పై రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ పలు వాయిదాల అనంతరం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో సమంత సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ చిత్రాన్ని మొదట తన కోసం రాయలేదని, ఫీమేల్ లీడ్ పాత్ర కోసం తొలుత సాయి పల్లవిని సంప్రదించారని సమంత వెల్లడించింది. అయితే సాయి పల్లవి బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ కుదరకపోవడంతో కథలో మార్పులు చేసి తనకు అనుగుణంగా రూపొందించారని తెలిపింది. ఈ సినిమా మహిళా ప్రధాన చిత్రాలకు మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని హీరోయిన్లు ఇలాంటి కథలను ఎంపిక చేసుకునేలా ప్రేరణనిస్తుందని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!