

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఐదో చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెలలో ఘనంగా ప్రారంభమైన ఈ వినోదాత్మక చిత్రం జూన్ 22 నుంచి మోకిలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం వెంకటేష్ లేకుండానే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, కళ్యాణ్రామ్, కృతి శెట్టి మొదటి షెడ్యూల్ నుంచే షూటింగ్లో పాల్గొంటున్నారు. జూలై 2 నుంచి వెంకటేష్ కూడా చిత్రీకరణలో పాల్గొననున్నట్లు సమాచారం.
ఈ కొత్త షెడ్యూల్లో కీర్తి సురేష్ కూడా చిత్రబృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాకు వెంకటేష్ ప్రత్యేకంగా తేదీలు కేటాయించారు. నవంబర్ మధ్య నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి లక్ష్యంగా పెట్టుకున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి 2027 సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!