

విజయ్ దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై, టీ సిరీస్ సమర్పణలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “టాక్సీవాలా చిత్రం చేసి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో మన జీవితం ఎంతో మారింది. మంచి కథలు రాయాలనే నీ తపన తగ్గలేదు. మనం కలిసి రెండు సినిమాలే చేసినా ఎన్నో పోరాటాలు చేశాం. రణబాలితో మరో విజయం సాధిద్దాం” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!