

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాకు విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్తో దేశీయ, ఓవర్సీస్ మార్కెట్లలో సినిమా వసూళ్లు పుంజుకుంటున్నాయి.
సాక్నిల్క్ సమాచారం ప్రకారం.. ‘విశ్వనాథ్ & సన్స్’ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.74.47 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా పెరిగాయి. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్ను దాటినట్లు చిత్ర బృందం ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా సినిమా నిలిచినట్లు తెలుస్తోంది.
బుక్మైషోలోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. గత 24 గంటల్లో 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సూర్య సరసన మమితా బైజు హీరోయిన్గా నటించగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్లో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!