

మెట్రో రెండోదశ విస్తరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, ఇది ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సోమవారం ప్రకటనలో ఆయన తీవ్రంగా స్పందించారు.
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రో మంజూరు చేస్తున్నా హైదరాబాద్కు ఎందుకు రాలేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో మెట్రో పనులు కేవలం 28 శాతం మాత్రమే పూర్తయ్యాయని, 2014 తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 72 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్ మెట్రో రద్దు చేయడం, ప్రాజెక్టు ఆస్తులపై కుట్రలు చేయడం వంటి చర్యలకు సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!