

తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ముసాయిదాలో హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. మలక్పేట్ నియోజకవర్గంలో మొత్తం 3,30,191 ఓట్లు ఉండగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,354, 2024 లోక్సభ ఎన్నికల్లో 1,35,807 ఓట్లు పోలయ్యాయి. అయితే SIR ముసాయిదాలో 1,47,799 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. యాకత్పురాలో మొత్తం 3,74,948 ఓట్లకు గాను 2023లో 1,39,990, 2024లో 1,56,341 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో 1,54,982 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 21,72,111 ఓట్లు పోలయ్యాయి. అయితే SIR ముసాయిదాలో 19,41,444 ఓట్లు తొలగింపు జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా యాకత్పురా, మలక్పేట్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలో ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ గణాంకాలపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!