

కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ నిధుల మళ్లింపు ఆరోపణల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి బి. నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు తెలియజేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల్లో సుమారు రూ.89.63 కోట్ల అక్రమ లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి.
నాగేంద్ర గతంలోనూ ఈ వ్యవహారం కారణంగా 2024లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయనను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరోసారి రాజీనామా అంశం తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. న్యాయపరమైన ప్రక్రియలో తాను నిర్దోషిగా బయటపడతానన్న నమ్మకంతో ఉన్న నాగేంద్ర.. ఆ తర్వాత మళ్లీ మంత్రివర్గంలోకి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనలను తీవ్రతరం చేసింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!