

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా హైడ్రా కమిషనర్ కేసుపై స్పందించారు. ఈ అంశంలో కోర్టు ప్రభుత్వ వాదనను కూడా వినే అవకాశం ఉందని తెలిపారు. కోర్టు తీర్పు పూర్తి ప్రతిని అందుకున్న తర్వాత ప్రభుత్వం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తుందని చెప్పారు. తీర్పు కాపీ రాకముందే బీఆర్ఎస్ తమ అనుకూల మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం ప్రారంభించిందని ఆరోపించారు.
హైడ్రా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు పనిచేస్తోందని, దీనికి మధ్యతరగతి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ కోణంతోనే కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే ఢిల్లీలో విద్యార్థుల నిరసన బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అండగా నిలిచారని, విద్యార్థులపై లాఠీచార్జీ జరిగిన తర్వాతే రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టారని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!