

హరీశ్రావు లేఖపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్పందించారు. 22ఏ భూముల అంశంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. కింది స్థాయిలో జరిగిన ఏదైనా తప్పిదం ప్రభుత్వం దృష్టికి వస్తే.. లోపాలను గుర్తించి సరిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే జరిగిన తప్పిదాన్ని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించి సరిదిద్దారని పేర్కొన్నారు. 22ఏ నిబంధనల వల్ల భూదందా, భూముల అన్యాక్రాంతానికి ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యులకు అన్యాయం జరిగితే గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చని అన్నారు.
ఇటీవల పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మహేశ్కుమార్ గౌడ్ స్పందించారు. ఆయనతో మాట్లాడామని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు 70 శాతం ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. బాన్సువాడలో పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నారని మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!