
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫ్ ది రికార్డు సంభాషణలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు, కేసుల నమోదు, అధికారుల బదిలీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీని విమర్శించినందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కేసైనా నమోదు చేశారా అని ప్రశ్నించిన ఆయన, తమ ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారం కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు.
అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న పరిపాలనా అధికారమని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో, బీజేపీ నేతలు కూడా అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. "కాక్రోచ్ జనతా పార్టీ" వంటి వ్యాఖ్యలు, విద్యార్థులపై చేసిన విమర్శలు మరింత తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!