

ఫాంహౌస్ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు జరిగిన అన్ని పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. బాధ్యులను ఎవరినీ వదలకుండా విచారణ జరిపి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని శాసనసభలో చెప్పారు. దళితులు, స్పీకర్ను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, మహిళా పోలీసులపై దాడులకు సంబంధించిన ఫిర్యాదులపై ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నియంత్రణ చట్టం కింద ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణ చేపడతామని వెల్లడించారు. విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్కుమార్ను నియమించే అంశాన్ని ప్రకటించారు. ప్రభుత్వం స్పీకర్కు అండగా ఉంటుందని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారని రేవంత్రెడ్డి ధైర్యం చెప్పారు.
ఫాంహౌస్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై కుట్రకు ప్రణాళిక రచించారని, సభ్యులను దాడులకు ప్రేరేపించారని సీఎం ఆరోపించారు. సభలో విద్య, ధరణి, 22-ఏ భూములు, ఇతర ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. దళిత ప్రతినిధులు ఫాంహౌస్ వద్ద నిరసన తెలిపిన అనంతరం అక్కడ శుద్ధీకరణ చేపట్టినట్లు వచ్చిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అంటరానితనం, వివక్షకు ప్రజా ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఫాంహౌస్ ఘటన నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటినీ క్రోడీకరించి, చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!