
రాజకీయాలు

న్యూఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన సీజేపీ నిరసనల సందర్భంగా ఉగ్ర కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నలుగురు మైనర్లతో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు తుపాకులు, నాలుగు పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దర్యాప్తులో నిందితులు విదేశీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో ఎనిమిది మంది జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్నట్లు గుర్తించామని, నిరసనల సమయంలో దాడికి యత్నించిన కుట్రను భద్రతా బలగాలు ముందుగానే అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!