
రాజకీయాలు

పూల బొకేలు, శాలువాలు వంటి సంప్రదాయ కానుకలకు భిన్నంగా నటుడు విషాల్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గౌరవార్థం ఆర్థికంగా వెనుకబడిన ముగ్గురు విద్యార్థినుల ఉన్నత విద్యకు స్పాన్సర్షిప్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అభిమానులు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
“ఒక బొకే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.. కానీ ఒక చిన్నారి విద్య జీవితాంతం వెలుగునిస్తుంది” అనే సందేశంతో విషాల్ తన ఆలోచనను వెల్లడించారు. విద్య ద్వారా సమాజంలో శాశ్వత మార్పు తీసుకురావచ్చనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. విషాల్ చేసిన ఈ వినూత్న కానుక ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!