
జనరల్

‘అగ్నిపరీక్ష 2’ షూట్కు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. టాప్ 15 షూట్లో పోటీ గట్టిగానే సాగుతున్నట్లు టాక్. జడ్జిల నుంచి వార్నింగ్ సూచించే ఎల్లో కార్డులు కొందరికి వచ్చినట్లు సమాచారం. నవ రసాలు మావా, రోహిత్, స్రష్టి, యాంకర్ ప్రియ, గాయత్రి, అపూర్వలకు ఈ కార్డులు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో టాస్కుల్లో పోటీ మరింత రసవత్తరంగా మారిందట.
ఇక MVP రేసు కూడా ఆసక్తిని పెంచుతోంది. తాజా టాక్ ప్రకారం.. రోహిత్ నాయుడు రెండుసార్లు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచినట్లు తెలుస్తోంది. శాలిని, స్రష్టి, రాజకుమారి ఒక్కోసారి MVP టైటిల్ దక్కించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ టాక్ నిజమైతే ‘అగ్నిపరీక్ష 2’లో కంటెస్టెంట్ల మధ్య పోటీ రోజురోజుకూ మరింత హీట్ పెంచుతున్నట్టే!

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!