
క్రీడలు

మహిళల ఆసియా కప్లో పాకిస్థాన్పై భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ 13, ఫాతిమా జాఫర్ 14 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లు ఆరంభం నుంచే పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.

భారత్ తరఫున శ్రీ చరణి 7 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, ప్రేమా రావత్ 9 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. దీప్తి శర్మ రెండు వికెట్లు సాధించగా, శ్రేయాంక పాటిల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో పాక్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!