

2026 ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్కు ముందు భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం (బ్లూ) జెర్సీ స్థానంలో కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా భారత హాకీ జట్టు గుర్తింపుగా నిలిచిన బ్లూ జెర్సీని మార్చడంపై క్రీడా అభిమానులు, మాజీ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ జట్టు బ్రాండ్ ఐడెంటిటీని మార్చాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నించారు.
ఈ వివాదంపై స్పందించిన హాకీ ఇండియా, బ్లూ సింథటిక్ టర్ఫ్పై బ్లూ జెర్సీ కారణంగా ఆటగాళ్ల విజిబిలిటీ తగ్గుతుండటంతో సాంకేతిక కారణాల దృష్ట్యా కాషాయ రంగును ఎంపిక చేసినట్లు వెల్లడించింది. కాషాయం జాతీయ పతాకంలోని ధైర్యం, త్యాగానికి ప్రతీక అని పేర్కొంది. ఇదే తొలిసారి జెర్సీ రంగు మార్పు కాదని, గతంలో కూడా 2014లో పసుపు, 2018లో స్కై బ్లూ జెర్సీలను ఉపయోగించినట్లు తెలిపింది. మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా మాత్రం ఈ మార్పుపై తన ఆందోళన జట్టు వారసత్వ గుర్తింపు గురించేనని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!