

భద్రతాపరమైన ఆందోళనల కారణంగా వాయిదా పడిన భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్పై ఇంకా స్పష్టత రాకపోయినా, టీమ్ ఇండియా తప్పకుండా తమ దేశంలో పర్యటిస్తుందనే విశ్వాసాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ వ్యక్తం చేశారు. గత ఏడాది జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ను దేశంలోని పరిస్థితుల కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐతో ఈమెయిల్స్, చర్చల ద్వారా నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని, భారత్కు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తామని తమీమ్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ పూర్తిగా సురక్షిత దేశమని, ఈ సిరీస్ ఇరు జట్లకూ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.
అయితే సెప్టెంబర్లో అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ ఉండటంతో భారత జట్టు షెడ్యూల్ ఇప్పటికే బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పర్యటన ఖరారైతే షెడ్యూల్లో మార్పులు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ అంశంపై స్పందించిన తమీమ్, బీసీబీ అధ్యక్షుడిగా తనకూ కొన్ని పరిమితులు ఉన్నాయని, అయినప్పటికీ సంబంధిత అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతూ ఈ సిరీస్ ప్రాధాన్యాన్ని వివరిస్తున్నానని తెలిపారు. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ తీసుకోవాల్సి ఉందన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!