
జనరల్

మూడు ప్రధాన టోర్నీల్లో విజేతగా నిలిచినప్పటికీ టీమిండియా ఫీల్డింగ్ లోపాలు అభిమానులు, క్రికెట్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం చూపించడం వల్ల క్యాచ్లను వదిలేసిన లోపాలు పెద్దగా బయటపడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలితే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో భారత్ 13 మ్యాచ్లు ఆడి 47 క్యాచ్లు అందుకోగా, 21 క్యాచ్లను వదిలేసింది. దీంతో మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్పై విమర్శలు రావడంతో బీసీసీఐ ఆయన స్థానంలో శుభదీప్ ఘోష్ను నియమించింది. భారత పురుష, మహిళా జట్లతో పనిచేసిన అనుభవం ఉన్న ఘోష్కు ఇప్పుడు టీమిండియా ఫీల్డింగ్ను మెరుగుపర్చే బాధ్యత ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!