

తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ ప్రవల్లిక నరిమళ్ల ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2026లో భారత్కు స్వర్ణ పతకం అందించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. చైనాలోని ఒర్డోస్లో జరిగిన మహిళల 4x400 మీటర్ల రిలే ఫైనల్లో ప్రవల్లిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖాతూన్లతో కూడిన భారత జట్టు 3:33.62 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆతిథ్య దేశం చైనా రజతం, కజకిస్థాన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి. టోర్నీలో భారత్ మొత్తం 3 స్వర్ణాలు, 4 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 16 పతకాలు సాధించింది.
ఈ విజయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రవల్లికను అభినందించారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ప్రవల్లిక అంతర్జాతీయ స్థాయిలో రాణించడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తాపీ మేస్త్రీ కుమార్తెగా సాధారణ కుటుంబం నుంచి వచ్చి కఠిన శ్రమతో విజయం సాధించారని ప్రశంసించారు. ప్రవల్లికకు శిక్షణ అందించిన కోచ్లతో పాటు ఈ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!