

టెక్ ప్రియుల కోసం అమెజాన్, ఫ్లిప్కార్ట్ జులై 4 నుంచి భారీ డిస్కౌంట్ సేల్స్ నిర్వహించనున్నాయి. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 17 సిరీస్పై ఆఫర్లను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా ప్రీమియం స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక డీల్స్ను వెల్లడించింది. ఈ సేల్లో ప్రధాన ఆకర్షణగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా నిలిచింది. లాంచ్ సమయంలో రూ.1,29,999గా ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.99,000కు అందుబాటులోకి రానుంది.
అదే విధంగా వన్ప్లస్ 13 బ్యాంక్ ఆఫర్లతో రూ.51,999కు, నథింగ్ ఫోన్ (3) రూ.40,999కు విక్రయించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. బడ్జెట్, మిడ్రేంజ్, ప్రీమియం విభాగాల్లో మరిన్ని ఆఫర్లు త్వరలో ప్రకటించనుంది. అలాగే జూన్ 29న శాంసంగ్ M47, జూన్ 30న వన్ప్లస్ N6 5G స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. ప్రైమ్ సభ్యులకు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, హోమ్ అప్లయెన్సెస్పై 80 శాతం వరకు తగ్గింపులు లభించనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!