

గత నెలలో భారత్ రోజుకు సగటున 4.93 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి చేసుకున్నట్లు పరిశోధనా సంస్థ కెప్లర్ నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పటివరకు ఒక నెలలో నమోదైన అత్యధిక దిగుమతి స్థాయి అని తెలిపింది. ఇందులో రష్యా నుంచే రోజుకు సుమారు 2.6 మిలియన్ బ్యారెళ్ల చమురు వచ్చిందని పేర్కొంది. జూన్ నెలలో మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 50 శాతాన్ని మించగా, 2022–23 నుంచి భారత్కు అతిపెద్ద ముడిచమురు సరఫరాదారుగా రష్యా కొనసాగుతోందని నివేదిక తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా పరిస్థితులు మెరుగవుతున్నాయని కెప్లర్ అంచనా వేసింది. ఆఫ్రికా, రష్యా, వెనెజువెలా మరియు ఒపెక్+ దేశాలు ఉత్పత్తిని పెంచుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ముడిచమురు సరఫరా స్థిరంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. భారత రిఫైనరీలు ఆగస్టు తొలి అర్ధభాగం వరకు అవసరమైన చమురుకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చినట్లు కూడా పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!