

దేశంలోని టెలికం సంస్థలు 2025 మార్చి త్రైమాసికంలో మరో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ కాలంలో టెలికం కంపెనీలు మొత్తం రూ.1.05 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.98,250 కోట్లతో పోలిస్తే ఇది 6.9 శాతం అధికం అని ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) కూడా గణనీయంగా పెరిగింది. మార్చి త్రైమాసికంలో ఏజీఆర్ 9.45 శాతం వృద్ధితో రూ.86,716 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.79,226 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించే లైసెన్స్, స్పెక్ట్రమ్ ఫీజులు కూడా ఏజీఆర్లో భాగంగా ఉంటాయి.
మొత్తం ఏజీఆర్లో 83.59 శాతం వాటా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలదే. రిలయన్స్ జియో రూ.32,468 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, భారతీ ఎయిర్టెల్ రూ.28,773 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.8,195 కోట్లను నమోదు చేశాయి. బీఎస్ఎన్ఎల్ ఏజీఆర్ 6.19 శాతం తగ్గి రూ.2,101 కోట్లకు చేరగా, ఎంటీఎన్ఎల్ రూ.333 కోట్ల ఏజీఆర్ను నమోదు చేసింది. ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.6,936 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల రూపంలో రూ.1,017 కోట్లు లభించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!