

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 11,000–12,000 మంది ఉద్యోగులను నియమించుకునే ప్రణాళిక ఉన్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ముఖ్యంగా క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణతో పాటు బ్యాంకు అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త నియామకాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న తమ విస్తృత బ్రాంచ్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు 200–250 కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేయాలని ఎస్బీఐ భావిస్తోంది. 2026 మార్చి నాటికి బ్యాంకులో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలు దాటింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఏకంగా 25,633 మందిని నియమించుకుంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదిస్తున్న రూ.30,000 కోట్ల ఐపీఓలో ఎస్బీఐ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ కలిసి 1 శాతం వాటాను విక్రయించనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!