

ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలం విరామం తర్వాత మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ నటుడు అనీల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. తాజాగా ఆయనతో పాటు షాహిద్ కపూర్, ఆలియా భట్ పేర్లు కూడా చిత్ర తారాగణంలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త నిజమైతే డ్రాగన్ స్థాయి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్లో సినిమాకు ఇది అదనపు బలంగా మారే అవకాశం ఉంది. అయితే షాహిద్ కపూర్, టోవినో థామస్ స్థానంలో కనిపించనున్నాడనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయాలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాలి. ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!