
జనరల్

విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. మిడ్డే మీల్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ అందించే ఆలోచనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడమే కాకుండా, పోషకాహార లోపాలను కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు.
అదే సమయంలో ఈ చర్య ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల ఆసక్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా హాజరు శాతం పెరగడంతో పాటు పాఠశాలలలో నమోదు కూడా పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై సమగ్రంగా అధ్యయనం జరుగుతుండగా, త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!