
సినిమాలు

తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు నేడు బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని యాజమాన్యాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అసోసియేషన్ కోరింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల్లో విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!