
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న వారి నివాసాల వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో జరిగిన నిరసన సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను తాతా మధు అనుచిత పదజాలంతో దూషించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం.
మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నివాసానికి కూడా పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీల అరెస్టుతో హైదరాబాద్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!