
జనరల్

శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సమగ్ర కాలుష్య నియంత్రణ మాస్టర్ ప్లాన్ను ప్రకటించింది. ఈ చర్యలు 2026 నవంబర్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటాయి. కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం లేని వాహనాలకు ఇంధనం ఇవ్వరు. అలాగే 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 31 వరకు కూల్చివేతలు, పౌర నిర్మాణ పనులపై నిషేధం అమలు చేస్తారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తారు. అదేవిధంగా నవంబర్ 1 నుంచి పార్కింగ్ రుసుములను రెట్టింపు చేయనున్నారు. ఢిల్లీని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!