

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. గతేడాది కోల్కతాలోని యువభారతి క్రీడాంగణంలో నిర్వహించిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈవెంట్ సందర్భంగా చోటుచేసుకున్న గందరగోళంతో ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు 33 వేల మంది అభిమానులకు రీఫండ్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుంచి నిధులు వినియోగించనున్నట్లు చెప్పారు.
2025 డిసెంబర్ 13న జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా అవ్యవస్థ నెలకొనడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టికెట్ల ధరలు రూ.4,000, రూ.6,000గా ఉన్నాయని సీఎం సువేందు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడారంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శిస్తూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ ఇండోర్ స్టేడియాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది 100 స్టేడియాల నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!