
సినిమాలు

శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రతిరోజులాగే రాత్రి విధులకు వెళ్లేందుకు కంపెనీ ఏర్పాటు చేసిన క్యాబ్లో బయల్దేరిన ఉద్యోగినిని డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటన అనంతరం బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్టు ఔట్పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల రవాణా, భద్రతా ఏర్పాట్లపై విమానాశ్రయ అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే చర్యలపై చర్చించారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!