

హైకోర్టు, జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల కొరతతో తెలంగాణలో పెండింగ్ కేసుల భారం పెరుగుతోంది. సుప్రీంకోర్టు విడుదల చేసిన ఇండియన్ జ్యుడీషియరీ వార్షిక నివేదిక 2024–25 ప్రకారం, 2025 జూన్ 30 నాటికి రాష్ట్రంలో 11.67 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో హైకోర్టులో 2.29 లక్షలు, జిల్లా న్యాయవ్యవస్థలో 9.3 లక్షల కేసులు ఉన్నాయి. హైకోర్టులోని సుమారు 32 వేల కేసులు దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 27 మంది మాత్రమే పనిచేస్తుండగా, 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కేసుల పెండింగ్ ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, సాంకేతికత విషయంలో రాష్ట్ర న్యాయవ్యవస్థ ముందుకు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 20 కొత్త ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, వాటిలో 61 కొత్త కోర్టు హాళ్లు, 30 నివాస సముదాయాలు ఉన్నాయి. న్యాయ సేవలను డిజిటలైజ్ చేసే చర్యల్లో భాగంగా హైకోర్టు వివిధ కోర్టుల్లో 99 ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశంలోని 25 హైకోర్టులతో పోలిస్తే తెలంగాణ హైకోర్టులో కేసుల పెండింగ్ భారం మధ్యస్థంగానే ఉందని నివేదిక పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!