
బిజినెస్

తెలంగాణ ప్రభుత్వం నేడు ఖరీఫ్ రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని విడుదల చేయనుంది. మొదట మధిరలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు దశలవారీగా రైతుభరోసా అందించనున్నారు. తొలి విడతలో 2 ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు జమ చేయనున్నారు. అనంతరం గత ఖరీఫ్ మాదిరిగానే ఒక్కో దశలో ఒక్కో ఎకరం చొప్పున అర్హతను పెంచుతూ సాయం అందించనున్నారు. రైతువేదికల వద్ద రైతులు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!