

నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక సూచనలు జారీ చేసింది. జూన్ 21న జరగనున్న పరీక్షను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మరియు విద్యార్థులకు అనుకూలంగా నిర్వహించేందుకు పలు మార్పులను ప్రకటించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం పరీక్ష సమయాన్ని 195 నిమిషాలకు పెంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాజరు నమోదు, సంతకాలు, ఇతర పరిపాలనా ప్రక్రియల వల్ల విద్యార్థుల రాత సమయం తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది.
అదేవిధంగా, పరీక్షలో రఫ్ వర్క్ కోసం అందించే పేజీల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచారు. ఎడమచేతి వాటం ఉన్న విద్యార్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు ప్రశ్నాపత్రం లేఅవుట్లో కూడా మార్పులు చేశారు. నాలుగు రఫ్ పేజీలలో రెండు ప్రశ్నాపత్రం ప్రారంభంలో, మరో రెండు చివరన ఉంచనున్నారు. ఈ మార్పులు ఇంగ్లీష్తో పాటు అన్ని ప్రాంతీయ భాషల ప్రశ్నాపత్రాలకు వర్తిస్తాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు తాజా మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి పరీక్షకు హాజరు కావాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!