
జనరల్

చిన్నారి నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ అతను తనను చూసి చిరునవ్వుతో పలకరించిన క్షణాలు జీవితాంతం మరచిపోలేనివని తెలిపారు. వ్యాధితో పోరాడుతూ కూడా నిరంజన్ చూపించిన ధైర్యం, ఆశావాదం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
నిరంజన్ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తీరని విషాదాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. నిరంజన్ చిరునవ్వు, ధైర్యం, ప్రేమ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొంటూ, అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!