
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా, ఫలప్రదంగా సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. గందరగోళానికి తావు లేకుండా వాస్తవాల ఆధారంగా చర్చలు జరపాలని ఎంపీలకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి గొంతుకు అవకాశం ఉండాలని, ప్రతి అభిప్రాయాన్ని గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.
గత నెలలో భారత్ సాధించిన జాతీయ, అంతర్జాతీయ విజయాలను ప్రధాని ప్రస్తావించారు. సగటు వయసు 28 ఏళ్లే ఉన్న స్కైరూట్ బృందం చరిత్ర సృష్టించిందని ప్రశంసిస్తూ, భారత యువత సామర్థ్యానికి హద్దుల్లేవన్నారు. రాజస్థాన్లో రిఫైనరీ, దేశంలోని మూడో సెమీకండక్టర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ రైలు ప్రారంభాన్ని గుర్తుచేశారు. అలాగే 7.7 శాతం వృద్ధితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!